Friday, 30 September 2016

శిధిల వాక్యం

'ఈ రాజ్యంలో పేదరికాన్ని అంతం చేస్తున్నం.
అందరికీ మిద్దెలు కట్టిస్తున్నం.
గ్రామాల్లో తారు రోడ్లను నిర్మిస్తున్నం.
పట్టణాల్లో పరిశ్రమల్ని పారిస్తున్నం.
రాజ్యాన్ని అన్ని రాజ్యాల కంటే ముందుకు నడిపిస్తున్నం' 
ఓ రాజ్యాంగాధి నేత ప్రసంగం 
బుల్లి తెరపై.

ఓ పచ్చని ఆకు కళ్ళలోకి చూస్తూ
అడిగా 
'ఇదంతా నిజమేనా ?' అని.
'అవునవును అభివృద్ధి ఎంత నిజమో
విధ్వాంసమూ అంత వాస్తవం !' 
ఆ పత్ర హరితం
రాలుతూ
చెప్పిన చివరి వాక్యం.

No comments:

Post a Comment